కర్ణాటక రిజల్ట్స్ : ఇప్పటి వరకు ఆయా పార్టీలకు పోలైన ఓట్ల శాతం ఇదే..!

by Rajesh |
కర్ణాటక రిజల్ట్స్ : ఇప్పటి వరకు ఆయా పార్టీలకు పోలైన ఓట్ల శాతం ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఓటర్లు ఈ సారి కాంగ్రెస్ పక్షాన నిలుస్తున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన బొమ్మై ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 125 స్థానాల్లో మెజార్టీలో ఉంది. అయితే ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో కాంగ్రెస్ పార్టీ 42.9 శాతంతో దూసుకెళ్తుంది. బీజేపీ 36.1 శాతం, జేడీఎస్ 13.2 శాతంతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 5, జేడీఎస్ ఒక స్థానంలో విజయం సాధించాయి. అయితే కాంగ్రెస్ 124 స్థానాల్లో, బీజేపీ 69, జేడీఎస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అయితే మీడియాతో మాట్లాడిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సొంతంగానే స్టేట్ లో పవర్ లోకి వస్తామన్నారు.

Also Read...

కర్ణాటక రిజల్ట్స్ : స్వింగ్ స్టేట్‌లో కాంగ్రెస్ బౌన్స్ బ్యాక్

Next Story

Most Viewed